'వీర సింహారెడ్డి' డైలాగులకు స్పీకర్లు పగిలిపోతాయి: థమన్

by Dishanational4 |
వీర సింహారెడ్డి డైలాగులకు స్పీకర్లు పగిలిపోతాయి: థమన్
X

దిశ, సినిమా: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'వీర సింహారెడ్డి'. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈరోజు విడుదలకానున్న చిత్రానికి సంగీతం అందించిన ఎస్.ఎస్.థమన్ విలేఖరుల సమావేశంలో సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. 'వీర సింహారెడ్డి' కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. సినిమా వేరే రేంజ్‌లో ఉంటుంది. 'అఖండ'తో పోలిక లేదు. ఇది కల్ట్ మూవీ. హైలీ ఎమోషనల్, సిస్టర్ సెంటిమెంట్ మూవీలో నేపథ్య సంగీతం బాగా కుదిరింది. దర్శకుడు గోపి సహకారంతో మంచి మ్యూజిక్ ఇవ్వగలిగాను. జై బాలయ్య, సుగుణ సుందరి, మాస్ మొగుడు పాటలకు స్పీకర్లు పగులుతాయి. బాలయ్య కటౌట్ ఆ రేంజ్ మ్యూజిక్ డిమాండ్ చేస్తోంది' అని చెప్పుకొచ్చాడు. చివరగా తెలుగు సినిమా ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉందన్న థమన్.. సంక్రాంతికి వస్తున్న చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రెండూ బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

READ MORE

పవన్ కళ్యాణ్ పేరును చిరంజీవి ఫోన్‌లో ఎలా ఫీడ్ చేసుకున్నాడంటే..!



Next Story

Most Viewed